TN Local Body election results: తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సత్తాచాటింది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఎన్నికలు జరిగిన 21 కార్పొరేషన్లలో అన్నింటినీ డీఎంకే కూటమి కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు 138 మున్సిపాలిటీలకుగానూ 134 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఒక్క మునిసిపాలిటీలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
పట్టణ పంచాయతీల్లో కూడా డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోంది. 489 స్థానాలకు గానూ 435 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ ఫలితాల్లో ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపు దిశగా సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 1,373 కార్పొరేషన్ వార్డుల్లో డీఎంకే కూటమి 1,050 వార్డుల్లో, అన్నాడీఎంకే కూటమి 153 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు మున్సిపల్ వార్డుల్లో కూడా డీఎంకే జోరు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,842 మున్సిపల్ వార్డులు ఉండగా.. అధికార పార్టీ కూటమి 2,638 వార్డుల్లో, అన్నాడీఎంకే కూటమి 641 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పట్టణ పంచాయతీల్లో కూడా అధికార పక్షం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తుంది. మొత్తంగా 7,604 పట్టణ పంచాయతీలు ఉండగా 4,960 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే కూటమి 1,214కు పరిమితం అయ్యేలా ఉంది. జాతీయ పార్టీ అయిన భాజపా ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. అయితే 21 కార్పొరేషన్ వార్డుల్లో, 58 మున్సిపల్ వార్డుల్లో 233 పట్టణ పంచాయతీ వార్డుల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కంచుకోట బద్దలు..
ఇక ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది డీఎంకే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కోయంబత్తూరు ప్రాంతంలో ఏళ్లుగా గట్టి పట్టు కలిగిన అన్నాడీఎంకే పార్టీ 10 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ స్థానాల్లో 75 శాతానికి పైగా డీఎంకే విజయం సాధించింది. కార్పొరేషన్లలోని 1,374 వార్డుల్లో డీఎంకే 425 స్థానాల్లో జయభేరి మోగించింది. అన్నాడీఎంకే 75 స్థానాల్లో గెలిచింది.
ప్రచారంలో వివాదం.. ఎన్నికల్లో విజయం..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గాడ్సే వివాదానికి తెరతీసి ఉమా ఆనందన్ గెలుపొందారు. గ్రేటర్ చెన్నై నగరపాలక సంస్థలోని 134వ వార్డు నుంచి ఎన్నికయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే అభ్యర్థులు బరిలో నిలిచినా.. 5,539 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో ఉమా ఆనందన్.. గాడ్సే గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి.
ఖాతా తెరిచిన ఎంఐఎం..