తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Roof Collapse Today : ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి.. చిన్నారులు కూడా.. - కూలిన ఇంటి శ్లాబ్

Roof Collapse Today : ఇంటిపైకప్పు కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Roof Collapse Today
Roof Collapse Today

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 10:51 AM IST

Updated : Sep 16, 2023, 12:03 PM IST

Roof Collapse Today : ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో ఘోరం జరిగింది. ఆలంబాగ్​లోని పాత రైల్వే కాలనీలో ఇంటిపైకప్పు కూలడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులను సతీశ్​ చంద్ర, అతడి భార్య సరోజినీ దేవి, పిల్లలు హర్షిత, హర్షిత్, అన్ష్‌లగా గుర్తించారు.

ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ..
అయితే విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని తూర్పు డీసీపీ హృదేశ్​ కుమార్​ తెలిపారు. శిథిలాల కింద సతీశ్​ కుటుంబసభ్యులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కానీ అప్పటికే వారంతా చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు.

మృతుడు సతీశ్​ చంద్ర.. తన కుటుంబంతో రైల్వే కాలనీలో నివసిస్తున్నారు. రైల్వే ఉద్యోగి అయిన అతడి తల్లి ఇటీవలే మరణించింది. దీంతో కారుణ్య నియమాకం ద్వారా సతీశ్​కు ఉద్యోగం దక్కింది. ఇటీవలే సతీశ్​ ఉద్యోగంలో చేరాడని.. ఇంతలో ఇలా జరగడం విషాదకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా.. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంపై యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ స్పందించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతులు నివసించిన ఇల్లు చాలా పాతదని ఈ సందర్భంగా తెలిపారు.

కొన్నాళ్ల క్రితం.. ఉత్తరప్రదేశ్​.. మధురలోని బాంకే బిహారి దేవాలయం సమీపంలో పురాతన భవనం కూలిపోయిన ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు. దేవాలయం నుంచి ఇంటికి వెళ్తున్న భక్తులపై బాల్కనీలోని పెద్ద భాగం కూలిపోయింది. వారిని రక్షించే సమయంలో భవనంలోని మరో గోడ కూలిపోయిందని పోలీసులు తెలిపారు. బాంకే బిహారి ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఓ పెద్ద భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఆ భవనంలో చాలా రోజుల నుంచి కోతులు తిరుగుతున్నాయి. ఇటీవలే మధ్య కురిసిన వర్షాలకు భవంతి పూర్తిగా దెబ్బతింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Mizoram Railway Bridge Collapse : నిర్మాణంలో ఉండగా కూలిన రైల్వే వంతెన.. 23 మంది కూలీలు మృతి

పాత భవనం కూలి 14 మంది మృతి.. ఉండొద్దని హెచ్చరించినా నివాసం..

Last Updated : Sep 16, 2023, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details