రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) చీఫ్ అజిత్ సింగ్ కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయన గురువారం ప్రాణాలు కోల్పోయారు. అజిత్ మరణాన్ని ఆయన తనయుడు జయంత్ చౌదరీ ధ్రువీకరించారు.
ఏప్రిల్ 20న కొవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత గురుగ్రామ్లోని ఓ ఆస్పత్రిలో చేరారు అజిత్ సింగ్. కరోనాకు చికిత్స పొందుతూనే మరణించారు.
మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్. 1939 ఫిబ్రవరి 12న ఉత్తరప్రదేశ్లోని మీరఠ్లో జన్మించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన చౌదరి అజిత్ సింగ్.. లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. యూపీఏ హయాంలో పౌరవిమానాయానశాఖ మంత్రిగా సేవలందించారు.