తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2021, 9:11 PM IST

ETV Bharat / bharat

Covid: కేరళలో కొవిడ్​ ఉద్ధృతి- కొత్తగా 23,500 కేసులు

కేరళలో కరోనా కేసులు(Corona cases) ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తున్నాయి. అక్కడ కొత్తగా 23,500 కేసులు వెలుగుచూశాయి. ఇక తమిళనాడులో 1,964.. కర్ణాటకలో 1,826 కేసులు నమోదయ్యాయి.

Corona cases
Corona cases

వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు(Corona cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కేరళలో మాత్రం కేసులు మంగళవారంతో పోలిస్తే మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 22,500 కేసులు నమోదయ్యాయి. మరో 19,411 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 116 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36.10 లక్షలకు చేరింది. కేరళలో ఇప్పటివరకు 18,120 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • దిల్లీలో కొత్తగా 37 కరోనా కేసులు బయటపడ్డాయి. 47 మంది కోలుకున్నారు.
  • ఒడిశాలో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 1,078 మందికి కరోనా సోకగా.. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 1,319 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో 1,964 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,197 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,826 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,618 మంది కోలుకోగా.. 33 మంది మృతిచెందారు.
  • సిక్కింలో కొత్తగా 157 మందికి కరోనా సోకింది. ధాటికి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
  • మేఘాలయలో కొత్తగా 463 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 10 మంది చనిపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details