తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాజ్యసభ నుంచే రిటైర్ అయ్యా.. రాజకీయాల్లోంచి కాదు' - కాంగ్రెస్ అసంతృప్తి నేతలు

తాను రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యాను కానీ.. రాజకీయాల్లోంచి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్​ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్​కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చేంతవరకూ పోరాడతానన్నారు. జమ్ముకశ్మీర్​లో కాంగ్రెస్​ అసంతృప్త నేతలు(జీ-23) ఏర్పాటు చేసిన 'శాంతి సమ్మేళన్' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Retired from Rajya Sabha not politics, will continue my fight for JK statehood: Azad
'రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యా.. రాజకీయాల్లోంచి కాదు'

By

Published : Feb 28, 2021, 12:13 AM IST

కాంగ్రెస్​ అసంతృప్త నేతలు(జీ-23) జమ్ముకశ్మీర్​లో ఏర్పాటు చేసిన 'శాంతి సమ్మేళన్' కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ​ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. తాను రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యాను కానీ.. రాజకీయాల్లోంచి కాదన్నారు. జమ్ముకశ్మీర్​కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చేంతవరకూ, కశ్మీర్​లోని స్థానికుల ఉద్యోగాలు, హక్కుల కోసం పోరాడతానన్నారు.

" నేను రాజ్యసభ నుంచి రిటైర్​ అయ్యాను.. కానీ రాజకీయాల నుంచి కాదు. చివరి శ్వాస వరకూ దేశం కోసం సేవ చేస్తా. ప్రజల హక్కుల కోసం పోరాడతా."

-- గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్​ నేత

ఈ కార్యక్రమంలో కపిల్ సిబల్​, మనీశ్ తివారీ, భూపేంద్ర సింగ్​ హూడా, రాజ్​ బబ్బర్​, ఆనంద్ శర్మ.. పాల్గొన్నారు.

2019 ఆగస్ట్​ 5న జమ్ము కశ్మీర్​కు రాష్ట్ర హోదాను రద్దు చేసినప్పుడు.. 'మనం మన అస్తిత్వాన్ని కోల్పోయాం. కానీ మళ్లీ రాష్ట్ర హోదా వచ్చేంత వరకూ పోరాడదాం.' అని ఆజాద్ అన్నారు.

ఇదీ చదవండి :అందరినీ గౌరవించటమే కాంగ్రెస్ బలం: ఆజాద్​

ABOUT THE AUTHOR

...view details