తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాలిబన్లకు కశ్మీర్ ఐజీపీ స్ట్రాంగ్​ వార్నింగ్​ - కశ్మీర్ ఐజీపీ

తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాలిబన్ల సమస్యను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

Kashmir
తాలిబన్

By

Published : Aug 21, 2021, 3:16 PM IST

Updated : Aug 21, 2021, 6:45 PM IST

తాలిబన్ల వ్యవహారం సహా కశ్మీర్​ లోయలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఉద్ఘాటించారు. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న క్రమంలో కశ్మీర్​కు ముప్పు పొంచి ఉందనే ఆందోళనల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాలు అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయని, ఉగ్రమూకల ఏరివేతకు సంసిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

అయితే, కశ్మీర్​ను ప్రశాంతంగా ఉంచాలంటే ప్రజల సహకారం కూడా కావాలని కోరారు విజయ్ కుమార్. ఉగ్రవాదులు, సూసైడ్ బాంబర్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని.. లేకపోతే నష్టపోయేది స్థానికులేనని వెల్లడించారు.

ఇదీ చూడండి:తాలిబన్లలకు మద్దతుగా పోస్టులు.. 14 మంది అరెస్ట్

Last Updated : Aug 21, 2021, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details