తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2021, 6:16 PM IST

Updated : Aug 11, 2021, 6:52 PM IST

ETV Bharat / bharat

ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మంగళవారం లోక్​సభ గడపదాటిన ఈ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే రాష్ట్రపతి అనుమతితో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది.

ఓబీసీ
ఓబీసీ

రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని వాటికే అప్పగించేందుకు ఉద్దేశించిన ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. 127వ రాజ్యాంగ సవరణ చట్టంగా దీనిని రాజ్య​సభలో బుధవారం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కించుకుంది. ప్రతిపక్షాలు చేసిన కొన్ని సవరణలను తిరస్కరించిన ఎగువ సభ.. డివిజన్ ఓటింగ్​ను నిర్వహించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 187 మంది సభ్యులు ఓటేయగా.. ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. రాజ్యాంగంలోని 368 అధికరణ ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్​సభలో మంగళవారం ఆమోదం పొందింది. రాష్ట్రపతి ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.

చారిత్రకం..

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితాను కలిగి ఉండేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుందన్నారు. మొత్తంగా 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని చెప్పారు. దేశంలోని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఈ బిల్లు చరిత్ర సృష్టించిందన్నారు. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు మద్దతిచ్చిన విపక్షాలకు కృతజ్ఞతలు చెప్పారు.

"ఓబీసీల గుర్తింపు, నిర్ధరణ ప్రక్రియకు అనుగుణంగా లేనందున సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్‌ను తొలగించింది. అందువల్ల రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సి వచ్చింది. ఓబీసీల సంక్షేమానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు సహకరించినందుకు, ఏకాభిప్రాయాన్ని కనబర్చినందుకు విపక్షాలకు, సభ్యులందరికకీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా."

-వీరేంద్ర కుమార్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి

అంతకుముందు.. ఈ బిల్లుపై చర్చించేందుకు నిర్దేశించిన మూడు గంటల సమయాన్ని మరింత పెంచాలని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేయగా.. ప్రభుత్వం అంగీకరించింది. ఈ బిల్లుపై దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 11, 2021, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details