తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్లమెంటరీ కమిటీల్లో హాజరు శాతం పెరగాలి'

పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీల హాజరు శాతం 50 కంటే మించి ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు 8 కమిటీ సభ్యులు, ఛైర్మన్లు లేఖ రాశారు. కమీటీల పనితీరు గణాంకాలను లేఖలో వివరించారు.

By

Published : Feb 17, 2021, 4:49 PM IST

Rajya Sabha panels improve performance, Naidu writes to chiefs to enhance attendance
'పార్లమెంటరీ కమిటీల్లో హాజరు శాతం పెరగాలి'

పార్లమెంటరీ కమిటీల్లో 50 కంటే అధిక హాజరు శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మేరకు ఎనిమిది పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ ఛైర్మన్లు, సభ్యులకు ఆయన లేఖ రాశారు. పని చేసే సమయం గతంలో కంటే మెరుగైనందుకు అభినందించారు.

రెండున్నర గంటలపాటే సమావేశం నిర్వహించాలని కాకుండా.. వీలైనంత ఎక్కువ సేపు కమిటీ సమావేశాలు కొనసాగించాలని తెలిపారు. 2017 సెప్టెంబర్ తర్వాత ​ కమిటీల కార్యకలాపాల వివరాలను తెలియజేస్తూ వెంకయ్యనాయుడు లేఖను పంపారు.

కమిటీల పని తీరు ఇలా..

  • విద్య, శిశు, మహిళ, యువత, క్రీడలపై ఏర్పాటు చేసిన స్టాండింగ్​ కమిటీ.. 65.3 శాతం సగటు హాజరును నమోదు చేసింది.
  • ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్టాండింగ్​ కమిటీ.. 52.46 శాతం
  • రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్​ కమిటీ.. 50.42 శాతం
  • 2017 సెప్టెంబర్​ నుంచి రాజ్యసభ పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీలు 355 సమావేశాలను నిర్వహించింది.
  • 2017-18లో 134 సమావేశాలు
  • 2018-19లో 49 సమావేశాలు
  • 2019 సెప్టెంబర్​ నుంచి ఇప్పటివరకు- 172 సమావేశాలు

ఏటా సెప్టెంబర్​లో ఈ కమిటీలను పునర్​ వ్యవస్థీకరిస్తారు. ప్రతి కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభ నుంచి 10 మంది, లోక్​సభ నుంచి 21 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పదకొండు మంది హాజరైతే కోరం​గా పరిగణిస్తారు.

  • 2019 సెప్టెంబర్​ నుంచి నిర్వహించిన 172 సమావేశాల్లో 8 పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీలు.. 49.34 హాజరు శాతాన్ని నమోదు చేశాయి. 2017-19 మధ్య నిర్వహించిన సమావేశాలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2017-19లో 42.9 సగటు హాజరు నమోదైంది.
  • 2017-19 మధ్య ఏ కమిటీ కూడా 50 శాతం హాజరును సాధించలేదు.
  • 2019 సెప్టెంబర్​ అనంతరం.. మూడు కమిటీలు 50 శాతం కంటే ఎక్కువ హాజరు శాతాన్ని నమెదు చేశాయి.
  • 2019 సెప్టెంబర్​లో ఏర్పాటైన అనంతరం నుంచి సగటు సమావేశాల వ్యవధి 2 గంటల ఏడు నిమిషాలు పెరిగింది. 2017-19 పోలిస్తే ఇది 16 శాతం అధికం.

ఈ కమిటీల పనితీరు.. పార్లమెంట్​ ఏడాది మొత్తం పని చేస్తోందనడానికి సాక్ష్యాలు అని వెంకయ్యనాయుడు తన లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రాజకీయ సంక్షోభం వేళ పుదుచ్చేరికి రాహుల్

ABOUT THE AUTHOR

...view details