తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2021, 4:39 PM IST

ETV Bharat / bharat

టెర్రస్​పై అతిపెద్ద కొవిడ్​ పెయింటింగ్​తో రికార్డుల్లోకి..

అతిపెద్ద పెయింటింగ్​ వేసి రాజస్థాన్ విద్యార్థులు.. ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు. కొవిడ్​పై అవగాహనను ప్రతిబింబిస్తూ అజ్మేర్​కు చెందిన డీఏవీ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఈ పెయింటింగ్​ వేశారు.

painting
పెయింటింగ్​

కొవిడ్​ పెయింటింగ్

రాజస్థాన్​లోని అజ్మేర్​కు చెందిన విద్యార్థులు రికార్డు​ సృష్టించారు. అతిపెద్ద పెయింటింగ్​ వేసి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు.

కరోనాపై అవగాహనను ప్రతిబింబిస్తూ అజ్మేర్​కు చెందిన డీఏవీ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పెయింటింగ్​ వేశారు. కళాశాల భవనం పైభాగంలో వేసిన ఈ పెయింటింగ్​ను ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి స్థానం కల్పించారు. దాదాపు 25 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంలో ఈ చిత్రం రూపొందింది.

కొవిడ్​ పై చిత్రం

"అతిపెద్ద చిత్రాన్ని గీసి మా కళాశాల విద్యార్థులు ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు. మాస్క్​, భౌతిక దూరం, శానిటైజర్​, వ్యాక్సిన్​లను కరోనాపై పోరాడే ఆయుధాలుగా చిత్రీకరించాము."

ABOUT THE AUTHOR

...view details