కరోనా ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్కు తీవ్ర డిమాండ్ ఏర్పడిన వేళ.. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవరూప మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాకు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.
'ఆక్సిజన్ ఎక్స్ప్రెస్'గా పిలిచే ఈ రైలు.. ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్ను సేకరిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఖాళీ ట్యాంకులతో ఉన్న రైలు సోమవారం ముంబయి నుంచి బయలుదేరి విశాఖపట్నం, భిలాయ్, జంశెద్పుర్, రాఉర్కెలా, బొకారోలో ఉన్న ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్ను సేకరిస్తుంది.