కరోనా మహమ్మారి నేపథ్యంలో స్టేషన్లలో రద్దీ తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది భారతీయ రైల్వే. కీలక రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.
పలు స్టేషన్లలో 3 నుంచి 5 రెట్లు టికెట్ రుసుం పెరిగింది. కొన్ని స్టేషన్లలో రూ.10 నుంచి రూ.30కి పెరగగా.. ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కొన్ని ముఖ్య స్టేషన్లలో రూ.50 వసూలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఈ ధరలను మార్చే అధికారాన్ని ప్రాంతీయ రైల్వే మేనేజర్(డీఆర్ఎం)లకు అప్పగించింది రైల్వే శాఖ.
ఇటీవలే తక్కువ దూరం ప్యాసింజర్ రైలు ప్రయాణ ఛార్జీలు పెంచింది రైల్వే శాఖ.
తాత్కాలికమే..