పుదుచ్చేరి పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమకు ఏం జరుగుతుందో అని భయపడకుండా పౌరులు న్యాయం పొందలేకపోతున్నారని అన్నారు. ఓవైపు జర్నలిస్టులు ప్రాణభయంతో ఉంటే.. ఎలాంటి చర్చలు జరగకుండానే పార్లమెంట్లో బిల్లులను ఆమోదిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన తమలాంటి నేతలకు.. లోక్సభలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంలేదని చెప్పారు. మోదీ తనని తాను ప్రధానిగా కాకుండా.. ఓ రాజులా భావించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపు ఐదేళ్ల పాటు పనిచేయకుండా చేశారని మండిపడ్డారు రాహుల్. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.
"ప్రజాతీర్పుకు ప్రధానమంత్రి విలువ ఇవ్వలేదు. మీ(ప్రజలు) ఓట్లకు విలువ లేదని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ద్వారా మోదీ పదేపదే సందేశం ఇచ్చారు. మీ కలలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేశారు. అన్ని ప్రభుత్వ సంస్థల మాదిరిగానే .. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
రాజీవ్ మరణంపై..