తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2021, 12:22 PM IST

ETV Bharat / bharat

'మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోంది'

మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోందని ట్విట్టర్​ వేదికగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. దిల్లీలో పెట్రోల్​ ధర రూ.100 దాటిన క్రమంలో ఈ మేరకు దుయ్యబట్టారు.

rahul slams modi
రాహుల్​ గాంధీ

పెట్రోల్​ ధరల పెంపును నిరసిస్తూ.. కేంద్రంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోందని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు.

" మీ కారు పెట్రోల్​ లేదా డీజిల్​తో నడుస్తుంది. మోదీ ప్రభుత్వం మాత్రం పన్ను దోపిడితో నడుస్తోంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకుడు

దిల్లీలో పెట్రోల్​ ధర రూ.100 దాటిన క్రమంలో ఈ మేరకు దుయ్యబట్టారు. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా తాజాగా లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 17పైసలు వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.100.21 పైసలకు చేరింది. లీటర్​ డీజిల్​ ధర రూ.89.53పైసలకు ఎగబాకింది.

ఇప్పటికే దేశంలో ముంబయి, చెన్నై, హైదరాబాద్​, పుణె వంటి నగరాల్లో పెట్రోల్​ ధర సెంచరీ దాటింది. కోల్​కతాలోనూ పెట్రోల్​ ధర బుధవారం వంద రూపాయలకు చేరింది.

ఇవీ చదవండి:'పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న మోదీ'

Petrol price: మళ్లీ పెరిగిన పెట్రోల్​ ధరలు

ABOUT THE AUTHOR

...view details