తెలంగాణ

telangana

పారిశ్రామికవేత్తలకు రుణమాఫీపై రాహుల్​ ధ్వజం

By

Published : Dec 31, 2020, 5:35 PM IST

పేదల పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేయడాన్ని తప్పుపట్టారు.

Rahul Gandhi attacks govt over loan waiver to industrialists
పారిశ్రామికవేత్తలకు రుణామాఫీపై రాహుల్​ ధ్వజం

మోదీ ప్రభుత్వం పేదల్ని విస్మరించి... బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన... కేంద్రాన్ని తప్పుబడుతూ ఈమేరకు ట్వీట్ చేశారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడా పారిశ్రామికవేత్తలకు రూ.2,37,876 కోట్లు రుణ మాఫీ చేసింది. మోదీ చెబుతున్న నిజమైన అభివృద్ధి ఇది. ఈ డబ్బుతో కనీసం 11 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేది. ఈ కరోనా సంక్షోభంలో ఒక్కో కుటుంబానికి రూ.20వేల చొప్పున అందిస్తే వారికి ఆసరాగా ఉండేది.

ABOUT THE AUTHOR

...view details