కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) నిర్వహించాల్సిన ఫస్ట్ క్లాస్ అసిస్టెంట్(ఎఫ్డీఏ)ని వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్డీఏ పరీక్షాపత్రం ముందుగానే లీక్ అయినట్లు గుర్తించారు. ఇందులో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్ష శనివారం జరగాల్సి ఉంది. కానీ లీకేజీ కారణంగా ఈ నెల 24న నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.