తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరి ప్రభుత్వానికి 'రాజీనామా' సెగ - పుదుచ్చేరిలో రాజీనామాలు

పుదుచ్చేరిలో కాంగ్రెస్​ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి వరుస రాజీనామాలు తలనొప్పిగా తయారయ్యాయి. ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే అదే బాటపట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో ప్రచారానికి కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ బుధవారం రానుండగా..ఈ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

Puducherry CM Narayanasamy in deep trouble: 4th Puducherry Congress MLA resigns
పుదుచ్చెేరి ప్రభుత్వంలో రాజీనామాల సెగలు

By

Published : Feb 16, 2021, 2:05 PM IST

కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న​ పుదుచ్చేరిలో కూటమి ప్రభుత్వానికి రాజీనామాల పర్వం వేధిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే జాన్​ కుమార్ అదే బాటపట్టడం వల్ల కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయ సెగ రాజుకుంది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పుదుచ్చేరిలో ప్రచారాన్ని మొదలుపెట్టడానికి కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ బుధవారం రానున్నారు. రాహుల్​ రాకకు ముందు జాన్​ కుమార్​ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

ఎమ్మెల్యే జాన్​ కుమార్ రాజీనామా పత్రం

ప్రస్తుత రాజీనామాలతో.. నామినేటెడ్​తో కలిపి 33 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఇప్పుడు అధికార- ప్రతిపక్ష కూటములకు సమానంగా చెరో 14 సీట్లు ఉన్నాయి. నాలుగు స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. అధికార పార్టీ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఒక ఎమ్మెల్యేపై జులైలో అనర్హత వేటు పడింది.

ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణా రావు ఈ నెల 15న సీఎం వి. నారాయణస్వామి కేబినేట్​ నుంచి వైదొలిగారు. అసెంబ్లీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా పత్రాన్ని స్పీకర్​కు అందించారు. ఈ పత్రాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.

మరో​ ఎమ్మెల్యే జాన్​ కుమార్​.. స్పీకర్​కు రాజీనామా పత్రాన్ని ఇప్పటికే అందించారు. ఇంతకుముందు మంత్రి ఎ. నమశ్శివాయం, ఎమ్మెల్యే తీపైంతమ్​ రాజీనామా చేశారు.

ఇదీ చదవండి:ఆ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం: దీదీ

ABOUT THE AUTHOR

...view details