తెలంగాణ

telangana

కొత్త ఏడాది వేళ గుడ్ ​న్యూస్​- ఆ ఇళ్ల మీద ఆస్తి పన్ను రద్దు

By

Published : Jan 1, 2022, 6:48 PM IST

Property Tax Waiver Mumbai: కొత్త ఏడాదిని పురస్కరించుకొని గుడ్​ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​(బీఎంసీ) పరిధిలోని 500 చదరపు అడుగుల్లోపు నివాస స్థలాలపై ఆస్తి పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Property tax waiver mumbai
ముంబయిలో ఆస్తిపన్ను రద్దు

Property tax waiver mumbai: కొత్త సంవత్సరం వేళ ముంబయి వాసులకు తీపికబురు చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​(బీఎంసీ) పరిధిలోని 500 చదరపు అడుగుల్లోపు నివాస స్థలాలపై ఆస్తి పన్ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పట్టణాభివృద్ధి శాఖతో శనివారం నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Bmc property tax: ఆస్తి పన్ను రద్దు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అధికారులను ఠాక్రే ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల బీఎంసీ పరిధిలోని 16 లక్షల ఇళ్ల యజమానులకు లబ్ధి చేకూరుతుందని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్​నాథ్ శిండే పేర్కొన్నారు. దీంతో.. 2017 బీఎంసీ ఎన్నికలకు ముందు ముంబయి వాసులకు ఇచ్చిన ప్రధానమైన హామీని శివసేన ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన చెప్పారు. వచ్చే నెలలో బీఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

రూ.468 కోట్ల నష్టం..

ఉద్ధవ్ ఠాక్రే శనివారం నిర్వహించిన ఈ వర్చువల్​ సమావేశంలో.. శిండేతో పాటు ముంబయి డిస్ట్రిక్ట్ గార్డియన్ మంత్రి అస్లామ్ షేక్​, ముంబయి సబర్బన్ డిస్ట్రిక్ట్ గార్డియన్ మంత్రి ఆదిత్య ఠాక్రే, మేయర్ కిశోరి పెడ్నేకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దేబాశిష్​ చక్రవర్తి పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల బీఎంసీ రూ.468 కోట్ల ఆదాయం కోల్పోనుందని ఓ అధికారి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:న్యూ ఇయర్​ కానుక- రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు

ఇదీ చూడండి:ఒక్కరోజులో 6 వేల సంస్థలకు విదేశీ విరాళాలు కట్​!

ABOUT THE AUTHOR

...view details