లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Kheri Incident) ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని సుమారు 50 గంటల సుదీర్ఘ విరామం తరువాత పోలీసులు అనుమతించారు. దీంతో ప్రియాంక, రాహుల్ ఇరువురు కలిసి చనిపోయిన రైతుల కుటుంబాలను కలుసుకున్నారు. అయితే ప్రియాంక నిర్బంధంలో ఉన్న సమయంలో ప్రియాంకను కలిసేందుకు తనను పోలీసులు అనుమతించలేదని ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. ఈ మేరకు ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మరణించిన కుటుంబాలకు సంతాపాన్ని తెలిపేందుకు ప్రియాంక ఆదివారం లఖ్నవూ చేరుకున్నారు. అక్కడ వర్షం పడుతోందని, లఖింపుర్ ఖేరి చేరుకోవడానికి మూడు గంటలు పడుతుందని ఆమె నాకు సమాచారం అందించారు. అయితే కొద్దిసేపటికే పోలీసులు తనని పట్టుకొని తోయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలను టీవీలో చూశాను. బాధిత కుటుంబాలకు సంతాపం తెలపడం అనేది ప్రభుత్వానికి పెద్దసమస్య కాదు. కానీ వారు అమెకు అనుమతించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
-రాబర్ట్ వాద్రా, ప్రియాంక భర్త
నిర్బంధంలో ఉంచిన ప్రియాంక గాంధీ.. బాధిత కుటుంబాలను కలుసుకున్న తరువాతే తిరిగి వస్తానని చెప్పినట్లు ఆమె భర్త రాబర్ట్ వాద్రా తెలిపారు.
ప్రియాంకను చాలా అపరిశుభ్రంగా ఉన్న గదిలో నిర్బంధించారు. ఆమె గది వెలుపల డ్రోన్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆ సమయంలో నేను ఆమెను కలవడానికి వెళ్లాలనుకున్నాను. అయితే అప్పుడే ప్రియాంకను విడుదల చేసిన సమాచారం అందింది. సమయానికి రాహుల్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రియాంక మాత్రం బాధిత కుటుంబాలను పరామర్శించిన తరువాతే తిరిగి వస్తాను అని చెప్పింది.