కొవిడ్ పరిస్థితుల్లో సెంట్రల్ విస్టా(నూతన పార్లమెంటు) నిర్మాణ పనులు కొనసాగించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. కరోనా వైద్య పరికరాలు, ఔషధాలపై ఖర్చు చేయాల్సిన సమయంలో నూతన పార్లమెంటు భవనం నిర్మించడం ఏంటని ప్రశ్నించారు.
'సెంట్రల్ విస్టా వ్యయంతో 62 కోట్ల టీకా డోసులు' - సెంట్రల్ విస్టా
విపత్కర పరిస్థితుల వేళ సెంట్రల్ విస్టా నిర్మాణం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఈ క్లిష్ట సమయంలో కరోనా నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

ప్రియాంక గాంధీ
"ప్రధాని నూతన నివాసం, సెంట్రల్ విస్టా మొత్తం ఖర్చు = 20వేల కోట్లు = 62 కోట్ల వ్యాక్సిన్లు = 22 కోట్ల రెమ్డెసివిర్ వయల్స్ = 3 కోట్ల 10 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు = 13 ఎయిమ్స్లు (12వేల పడకలతో కూడిన)" అని ప్రియాంక ట్వీట్ చేశారు. వెంటనే సెంట్రల్ విస్టా పనుల ఆలోచనను విరమించుకోవాలని ప్రియాంక సహా రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని కోరారు.