రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిన వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులపై దృష్టి సారించి ఉంటే.. మధ్య తరగతి ప్రజలపై భారం పడేది కాదని అన్నారు. తమిళనాడులో చమురు, గ్యాస్ ప్రాజెక్టులను మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రామనాథపురం-తూత్తుకుడి సహజవాయువు పైప్లైన్ను జాతికి అంకితమిచ్చారు.
"నేను ఎవర్నీ విమర్శించాలని అనుకోవడం లేదు. కానీ, మనం ఈ(ఇంధన దిగుమతులు) అంశంపై అంతకుముందే దృష్టి సారించి ఉంటే.. మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడే వారు కాదు."