తెలంగాణ

telangana

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ

By

Published : Aug 15, 2021, 7:38 AM IST

Updated : Aug 15, 2021, 9:15 AM IST

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Prime Minister Narendra Modi hoists the National Flag from the ramparts of Red Fort to celebrate the 75th Independence Day
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానికి.. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, త్రివిధ దళ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు మోదీ.

జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్న మోదీ
జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న మోదీ
త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూ..

మోదీ త్రివర్ణ పతాకం ఎగురవేసే సమయంలో ఆకాశం నుంచి పుష్ప వర్షం కురిసింది. భారత వాయుసేనకు చెందిన రెండు ఎంఐ 17 1వీ హెలికాప్టర్లు పూల రేకులను వెదజల్లాయి.

హెలికాప్టర్లు పూల రేకులను వెదజల్లుతున్న చిత్రం
.
సుందరంగా ముస్తాబైన ఎర్రకోట

ఎర్రకోటకు వచ్చే ముందు.. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు మోదీ. రాజ్​ఘాట్​ను సందర్శించి.. మహాత్ముడి సమాధికి అంజలి ఘటించారు.

ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులు
Last Updated : Aug 15, 2021, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details