తెలంగాణ

telangana

'కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది- యువత రావాలి'

By

Published : Jan 12, 2021, 12:00 PM IST

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.

Modi
'కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది- యువత రావాలి'

యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని.. ఇంటి పేర్లతో ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు ఇక లేవన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్​ హాల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్​గా మాట్లాడారు మోదీ.

"యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబ రాజకీయాలు కొనసాగుతాయి. సామాన్య యువకులు సైతం పార్లమెంట్‌లో అడుగుపెట్టాలి. మనముందు వివేకానందుడు చూపిన మార్గం ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి యువత పాఠాలు నేర్చుకోవాలి. యువతకు శారీరక, మానసిక దృఢత్వం అవసరమని వివేకానందుడు చెప్పారు. ఆయన అడుగుజాడలలోనే దేశం నడుస్తోంది.

కొత్తగా తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం.. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. యువతకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తోంది."

- ప్రధాని నరేంద్ర మోదీ

ABOUT THE AUTHOR

...view details