DRAUPADI MURMU BIOGRAPHY: ఒడిశాకు చెందిన ఆదివాసీ మహిళా నేతగా ఉన్న 64 ఏళ్ల ద్రౌపదీ ముర్ము రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర లిఖించారు. వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొంది అందరి మన్ననలు అందుకున్న ద్రౌపదీ.. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా విశేష సేవలందించారు. నాలుగేళ్ల వ్యవధిలో భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయినా ఆ బాధను దిగమింగుకుని ప్రజాసేవకు అంకితమయ్యారు.
ద్రౌపది ముర్ము ప్రస్థానం:
- ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ఆమె తండ్రి, తాత ఇద్దరూ గ్రామ సర్పంచ్గా సేవలందించారు.
- draupadi murmu education: మొదట టీచర్గా పనిచేసిన ద్రౌపదీ ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీలో చేరి రాయరంగపూర్ నగర్ పంచాయితీ కౌన్సిలర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాయ్రంగపూర్ నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ వైస్ ఛైర్పర్సన్గా పనిచేశారు.
- రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- భాజపా- బిజూ జనతాదళ్ కలిసి ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 మధ్య మంత్రిగా పనిచేశారు.
- 2010, 2013లో మయూర్భంజ్ భాజపా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో భాజపా ఎస్టీ మోర్చా జాతీయ కార్య నిర్వాహక సభ్యురాలిగా ఉన్నారు.
- draupadi murmu governor: 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా సేవలందించారు. ఒడిశా సైకత శిల్పి తీర్చిదిద్దిన సైకత శిల్పం