తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త నుంచి విడిపోయిన మహిళపై అమానుష దాడి - మధ్యప్రదేశ్​లోో పైశాచికత్వం

భర్తతో విడిపోయి.. మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్న గిరిజన మహిళ పట్ల కొందరు అనాగరికంగా వ్యవహరించారు. మహిళ భుజాలపై భర్త కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగింది.

pregnant-women-being-beaten-by-bat-and-forced-to-walk-3-km-keeping-his-brother-in-law-on-shoulders-in-guna
మహిళ భుజాలపై భర్త కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టి...

By

Published : Feb 16, 2021, 11:16 AM IST

మహిళ భుజాలపై భర్త కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టి..

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్న గిరిజన మహిళ పట్ల అనాగరికంగా వ్యవహరించారు భర్త కుటుంబ సభ్యులు. మహిళ భుజాలపై భర్త కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించారు. కొందరు యువకులు మహిళ వెనుక ఉండి... ఆమె వేగం తగ్గించినప్పుడు పాశవికంగా కర్రలతో కొట్టారు. ఈ దారుణమైన ఘటన సాగై, బాన్స్‌ ఖేడి గ్రామాల మధ్య జరిగినట్లు సమాచారం.

భర్త అంగీకారంతోనే విడిపోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు మహిళ పేర్కొంది. తర్వాత మరొక యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భర్త తరఫు బంధువులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని పోలీసులకు వివరించింది.

మహిళ ఫిర్యాదు మేరకు నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :కాలువలోకి దూసుకెళ్లిన బస్సు- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details