తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారు ప్రమాదంలో నలుగురు సజీవదహనం - Accident in prayagraj

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగులు మరణించారు. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటలు చెలరేగడం వల్ల కారుతో పాటు నలుగురు సజీవదహనమయ్యారు.

prayagraj : four persons burnt to death after car catches fire
కారు ప్రమాదంలో నలుగురు సజీవదహనం

By

Published : Nov 18, 2020, 9:36 AM IST

ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​ జిల్లాలో జవాఈన్​-పసనా ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఊరికి దూరంగా ప్రమాదం జరగడం వల్ల వారిని ఎవరు కాపాడలేకపోయారు. ఉదయం బయటకు వచ్చిన సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

కారు ప్రమాదంలో నలుగురు సజీవదహనం

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో కారులోని మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతులు పూర్తిగా కాలిపోవడం వల్ల వారు ఎవరు అనేది గుర్తించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శవపరీక్ష కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:గుజరాత్​లో రోడ్డు ప్రమాదాలు- 14 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details