తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో హంగ్​.. కేరళ పీఠంపై రెండోసారి  కామ్రేడ్లు!

శాసనసభ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అందరి కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించిన బంగాల్‌లో పోరు ఉత్కంఠభరితంగా ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చాయి. కేరళ, అసోంలో అధికార పార్టీలదే మళ్లీ హవా కొనసాగనుందని ఈటీవీ భారత్ అంచనా వేసింది. తమిళనాడులో డీఎంకే సత్తా చాటుతుందని, పుదుచ్చేరి భాజపా నెగ్గుతుందని సర్వేలో వెల్లడించింది.

By

Published : Apr 30, 2021, 1:58 PM IST

ETV bharat exit polls
ఎగ్జిట్ పోల్స్, ఈటీవీ భారత్ ఎగ్జిట్ పోల్స్

మే 2న.. అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ్​బంగా రాష్ట్రాల్లో వివిధ పార్టీల భవితవ్యం తేలనుంది. అయితే... శాసనసభ ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు​ ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందనే అంచనాలు వేశాయి. ఈ రాష్ట్రాల భవితవ్యంపై ఈటీవీ-భారత్ చేసిన సర్వే వివరాలు...

బంగాల్​లో తృణమూల్​దే హవా!

జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన బంగాల్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈటీవీ భారత్ సర్వే ఫలితాలను ప్రకటించింది. మరోసారి బంగాల్​లో టీఎంసీ హవా కొనసాగుతుందని అంచనా వేస్తోంది.

అయితే.. బంగాల్​లో ఎలాగైనా అధికారం చేపట్టాలనే వ్యూహంతో భాజపా తీవ్రంగా కృషి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్​ షా సహా పలువురు కీలక నేతలు భాజపా తరఫున పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. మరోవైపు ఈసారి కూడా అధికారం తప్పక తమదే అని తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ సర్వేలు తృణమూల్‌దే అధికారం అని తేల్చినా, ఆ పార్టీకి, భాజపాకు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని ఈటీవీ భారత్​ సర్వే చెబుతోంది.

బంగాల్ ఎగ్జిట్ పోల్స్

ఫలించనున్న డీఎంకే నిరీక్షణ..

దక్షిణాదిలో శాసనసభ ఎన్నికలు జరిగిన పెద్ద రాష్ట్రం తమిళనాడులో డీఎంకే ఘన విజయం సాధించబోతోందని ఈటీవీ-భారత్ ఎగ్జిట్ పోల్స్ అంచనా. భాజపాతో కలిసి బరిలోకి దిగిన అన్నాడీఎంకేకు భారీ ఓటమి తప్పదని సర్వేలో తెలుస్తోంది.

కరుణానిధి, జయలలిత లేకుండా తొలి సారిగా జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగానే రానున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. స్టాలిన్‌ నేతృత్వంలోని విపక్ష డీఎంకే ప్రభంజనం సృష్టించబోతోందని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి.

తమిళనాడు ఎగ్జిట్ పోల్స్

కేరళ, అసోంలో అధికార పార్టీలే...

కేరళ, అసోం శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీలదే మళ్లీ విజయం అని ఈటీవీ భారత్ అంచనా వేసింది. కేరళలో అధికార పార్టీ రెండో సారి గెలవదనే సుదీర్ఘ కాల సంప్రదాయం మారబోతోందని తేల్చింది. మలయాళ ప్రజలు తిరిగి ఎల్‌.డి.ఎఫ్‌ కూటమికే పట్టం కట్టబోతున్నారని భావిస్తోంది. అయితే, పినరయి విజయన్​పై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ.. రాష్ట్రంలో వరదలు, నిఫా వైరస్​, కొవిడ్​ను కట్టడి చేసేందుకు సర్కారు చేసిన కృషికి.. ప్రజల్లో పార్టీపై మంచి అభిప్రాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

కేరళ ఎగ్జిట్ పోల్స్
అసోం ఎగ్జిట్ పోల్స్

అసోంలో సైతం అధికార భాజపా మళ్లీ గెలుస్తుందని ఈటీవీ భారత్​ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి.

పుదుచ్చేరిలో...

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్​డీఏ అధికారం చేపట్టే అవకాశం ఉందని ఈటీవీ-భారత్​ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసింది. అన్నాడీఎంకే, భాజపా, రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ కూటములుగా ఏర్పడి పోటీ చేశాయి.

ఇదీ చదవండి:భారత్​కు చేరిన అమెరికా వైద్య పరికరాలు

ABOUT THE AUTHOR

...view details