తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓట్ల పండగ షురూ- పోలింగ్​ కేంద్రాలకు తరలిన ప్రజలు

4 రాష్ట్రాలు- ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్​ సాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్​ జరగనుంది.

By

Published : Apr 6, 2021, 7:38 AM IST

polling-underway-in-4-states-and-1-ut
ఓట్ల పండగ షురూ- పోలింగ్​ కేంద్రాలకు తరలిన ప్రజలు

దేశంలో ఓట్ల పండగ ప్రారంభమైంది. 4 రాష్ట్రాలు- ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటింగ్​ జరుగుతోంది. కొవిడ్​ నిబంధనలు- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

అసోం కక్రాజ్​హర్​ ప్రాంతంలో వృద్ధుల ఓట్లు

కేరళ(140), తమిళనాడు(234), పుదుచ్చేరి(30), బంగాల్​(మూడోదశ-31), అసోం(40)కు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్​ జరగనుంది.

పోలింగ్​ కేంద్రాలు ఫుల్​..

అసోంలోని అనేక పోలింగ్​ కేంద్రాల్లో ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అసోం గువాహటిలో ఉదయం 7 గంటలకు ముందే పరిస్థితి ఇది..
అసోం అమిన్​గావ్​లో...

అసోంలో ఇప్పటికే రెండు విడతల్లో ఓటింగ్​​ జరగ్గా.. 75శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది.

ప్రముఖుల ఓట్లు..

ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయమే పోలింగ్​ కేంద్రాలకు చేరుతున్నారు. సూపర్​స్టార్​ రజనీకాంత్​.. తమిళనాడులోని పోలింగ్​ కేంద్రం వద్ద ఓటు వేశారు.

కేరళ పాలక్కడ్​ భాజపా అభ్యర్థి, మెట్రోమ్యాన్​ శ్రీధరన్​.. పొన్నానిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన మెట్రోమ్యాన్​ శ్రీధరన్​

మోదీ ట్వీట్​..

ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ప్రజలు, ముఖ్యంగా యువ ఓటర్లు భారీ సంఖ్యల్లో తరలివెళ్లి రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని అభ్యర్థించారు.

ఇదీ చూడండి:-తమిళ పోరులో ప్రజలు ఎవరి పక్షం?

ABOUT THE AUTHOR

...view details