తెలంగాణ

telangana

నందిగ్రామ్​ రణంలో అగ్రనేతల ఆఖరి పంచ్!

By

Published : Mar 30, 2021, 3:42 PM IST

నందిగ్రామ్​లో ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. మమతా బెనర్జీ.. అన్ని తానై నియోజకవర్గాన్ని చుట్టేయగా.. సువేందు అధికారి కోసం కేంద్రహోంమంత్రి అమిత్​ షా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో విమర్శలు, ఆరోపణలు, మాటల తూటాలతో నందిగ్రామ్​ వీధులు హోరెత్తాయి.

Police from BJP-ruled states terrorising voters in Nandigram: Mamata
నందిగ్రామ్​ రణం: ఆఖరి పంచ్​పై దీదీ-సువేందు గురి

బంగాల్​లోని నందిగ్రామ్​లో శాసనసభ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున.. 'ఆఖరి పంచ్​' కోసం టీఎంసీ-భాజపా తీవ్రస్థాయిలో పోటీపడ్డాయి. అగ్రనేతల రోడ్​షోలు, సభలు, విమర్శలు, ఆరోపణలతో నందిగ్రామ్​ వీధులు హోరెత్తాయి. 'దీదీ జిందాబాద్' అంటూ టీఎంసీ కార్యకర్తలు ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లగా.. 'జై శ్రీరామ్​' నినాదాలతో కమలదళం రాజకీయ వేడిని పెంచింది. ఈ క్రమంలో అధికార-విపక్ష పార్టీల అగ్రనేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.

పోలీసు బలంతో...

గత రెండు రోజులుగా నందిగ్రామ్​లోనే ఉన్న మమత.. మంగళవారం ప్రచార పర్వాన్ని మరింత జోరుగా సాగించారు. చక్రాల కుర్చీపైనే నందిగ్రామ్​ వీధుల్లో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. భంగపొర నుంచి దాదాపు 3 కిలోమీటర్లు రోడ్​షో నిర్వహించి.. టీఎంసీకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

అంతకుముందు జరిగిన ఎన్నికల సభలో భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మమత రోడ్​షో

"భాజపా పాలిత రాష్ట్రం(మధ్యప్రదేశ్​) నుంచి వాళ్లు పోలీసులను రప్పించారు. గ్రామాల్లోని ఓటర్లను పోలీసులు భయపడెతూ.. భాజపాకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నందిగ్రామ్​లో విజయం నాదే. రాష్ట్రంలో మూడోసారీ టీఎంసీదే గెలుపు. వాళ్లు(పోలీసులు) ఇక్కడ కొన్ని రోజులే ఉంటారు. మేము మళ్లీ అధికారంలోకి వచ్చి వాళ్లకు గట్టి జవాబు చెబుతాము."

-- సంచోరా సభలో మమత.

ఈ క్రమంలో భాజపాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీదీ. నందిగ్రామ్​లోని ఓ మహిళను చంపేందుకు వారు ప్రణాళిక రచించారని.. ఇందుకోసం బిహార్​ నుంచి గూండాలను తీసుకొచ్చారని ఆరోపించారు. అలా హత్య చేసి, చివరకు దానిని బంగాల్​ మీద నెట్టేద్దామని వారు చూస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-నందిగ్రామ్ నాది.. ఇక్కడే ఉంటా: దీదీ

మంగళవారం ప్రచారాలు ప్రారంభించే ముందు.. మమతకు 'జైశ్రీరామ్​' నినాదాలతో స్వాగతం పలికారు రేయపరలోని భాజపా కార్యకర్తలు. ఈ క్రమంలో అక్కడి వాతావరణం కొంతమేర ఉద్రిక్తతంగా మారింది. అయితే మమత వెంటే ఉన్న భద్రతా సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై భాజపా మద్దతుదారులను అక్కడి నుంచి పంపించేశారు.

'బంగాల్​లో మార్పు కోసం..'

నందిగ్రామ్​లో భాజపా అభ్యర్థి సువేందు అధికారి తరఫున కేంద్రహోంమంత్రి అమిత్​ షా మంగళవారం ఎన్నికల ర్యాలీ, రోడ్​షో నిర్వహించారు. బంగాల్​లో మార్పు రావాలంటే.. మమతను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

షా రోడ్​షో

"బంగాల్​లో మార్పు తీసుకురావాలంటే మమతా బెనర్జీని ఓడించాల్సిందే. ఆ ఓటమి కూడా ఎవరు ఊహించని మెజారిటీతో ఉండాలి. అప్పుడే.. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయాలన్న ఆలోచనలు నేతలకు రావు. ఇక్కడ మీరు మమతను ఓడించండి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో టీఎంసీ ఓడిపోతుంది."

--- నందిగ్రామ్​ సభలో అమిత్​ షా

రెండో దశ​లో భాగంగా ఏప్రిల్​ 1న నందిగ్రామ్​లో పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

సువేందు-షా

ఇదీ చూడండి:-సువేందు ఆస్తుల విలువ రూ. 80 లక్షలు

ABOUT THE AUTHOR

...view details