ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లో ఓ అత్యాచార బాధితురాలి నుంచి లంచం డిమాండ్ చేసిన కానిస్టేబుల్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. రూ.20 వేలు ఇస్తే.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చేస్తానని బాధిత మహిళను నిందితుడు ప్రలోభపెట్టాడని పోలీసులు తెలిపారు.
అత్యాచార బాధితురాలి నుంచి లంచం- కానిస్టేబుల్ అరెస్ట్
అత్యాచార బాధితురాలి నుంచి లంచం డిమాండ్ చేసిన కానిస్టేబుల్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తాననే నెపంతో మహిళ నుంచి నిందితుడు రూ. 20వేలు డిమాండ్ చేశాడని పోలీసులు తెలిపారు.
రేప్ బాధితురాలి నుంచి లంచం డిమాండ్ చేసిన కానిస్టేబుల్ను అరెస్టు చేసిన యూపీ పోలీసులు
అంతేకాకుండా లంచం ఇవ్వడానికి అంగీకరించకపోతే చర్యలు తీసుకుంటానని మహిళను భయపెట్టాడని స్థానిక ఇన్స్పెక్టర్ రామ్ధారి మిశ్రా తెలిపారు. బాధిత మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కానిస్టేబుల్ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:లేడీ సింగమ్ ఆత్మహత్య కేసులో అధికారి అరెస్టు