తెలంగాణ

telangana

By

Published : May 28, 2021, 11:18 AM IST

Updated : May 28, 2021, 4:02 PM IST

ETV Bharat / bharat

Cyclone Yaas: మోదీతో మమతా బెనర్జీ భేటీ

PM Modi will visit Odisha and West Bengal to review cyclone Yaas impact on the two coastal states. Cyclone Yaas pounded parts of India's eastern coast on Wednesday, killing at least four people and forcing more than 21 lakh people to be evacuated to safe shelters in West Bengal, Odisha and Jharkhand.

modi review meeting
ప్రధాని నరేంద్ర మోదీ

15:47 May 28

మోదీతో మమత భేటీ..

బంగాల్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పశ్చిమ మేదినిపుర్​ జిల్లా కలైకుండాలో కలిశారు. యాస్​ తుపాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను మోదీకి అందించారు మమత.

వీరి మధ్య భేటీ 15 నిమిషాల పాటు సాగినట్టు తెలుస్తోంది. తుపానుతో అత్యంత దారుణంగా ప్రభావితమైన ప్రాంతాల గురించి ప్రధానికి సీఎం వివరించినట్టు సమాచారం.

11:45 May 28

ఒడిశా సీఎంతో మోదీ భేటీ 

తుపాను విధ్వంసంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​తో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మోదీ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.  

10:43 May 28

cyclone yaas: ఒడిశా సీఎంతో మోదీ భేటీ

యాస్​ తుపాను(yaas cyclone) ప్రభావంపై సమీక్షించడానికి ఒడిశాలోని భువనేశ్వర్​కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అధికారులతో సమీక్ష నిర్వహించాక తుపాను(yaas cyclone) ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. 

అనంతరం బంగాల్​లోనూ ఏరియల్​ సర్వే నిర్వహిస్తారు. 

బుధవారం తీరాన్ని తాకిన తర్వాత యాస్​ తుపాను(yaas cyclone) తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఒడిశా, బంగాల్​, ఝార్ఖండ్​లో ఇప్పటికే 21లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ధాటికి నలుగురు మృతి చెందారు. 

Last Updated : May 28, 2021, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details