ఫ్రంట్లైన్ వర్కర్లకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా 26 రాష్ట్రాల్లో 111 శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. లక్షకుపైగా కొవిడ్ వారియర్లకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రి కౌశల్ వికాశ్ యోజన 3.0 కింద రూ.276 కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
హోంకేర్, బేసిక్ కేర్, అడ్వాన్సుడ్ కేర్, ఎమర్జెన్సీ కేర్, శాంపిల్ కలెక్షన్ సహా మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ విభాగాల్లో కొవిడ్ వారియర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.