తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులతో నేడు ప్రధాని మోదీ సమావేశం - modi to participate in World Environment Day event

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో చర్చించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

PM MODI
ప్రధాని మోదీ

By

Published : Jun 5, 2021, 4:35 AM IST

Updated : Jun 5, 2021, 6:24 AM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ.. రైతులతోనూ సమావేశం కానున్నట్లు తెలిపింది. ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో మోదీ చర్చించనున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి :టీకా వృథాను అరికట్టాలి: మోదీ

Last Updated : Jun 5, 2021, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details