త్వరలో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరి, తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గురువారం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు.
పుదుచ్చేరిలో ప్రధాని..
ఉదయం 10:30 గంటలకు ప్రధాని.. పుదుచ్చేరికి చేరుకోనున్నారు. కరైకల్ జిల్లా పరిధిలోని సత్తనాథపురం-నాగపట్నం మధ్య ఎన్హెచ్ 45-ఏలోని 56 కిలోమీటర్ల రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,426 కోట్లతో ఈ రహదారి ప్రాజెక్టును చేపట్టనున్నారు. జవహార్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మెర్) కేంద్రానికి చేరుకుని రక్త కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన పాండిలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహింరంగ సభలో పాల్గొంటారు.