తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభివృద్ధి ప్రాజెక్టుల వేగాన్ని పెంచండి' - ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రూ.44 వేల 545 కోట్లతో చేపడుతోన్న అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్షించారు. ఈ మేరకు దిల్లీలో 36వ ప్రగతి సమావేశాన్ని నిర్వహించారు.

PM reviews projects
'అభివృద్ధి ప్రాజెక్టుల వేగాన్ని పెంచండి'

By

Published : Feb 24, 2021, 10:02 PM IST

Updated : Feb 24, 2021, 10:39 PM IST

దేశంలోని 12 రాష్ట్రాల్లో.. రూ.44,545 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్షించారు. దిల్లీలో నిర్వహించిన 36వ 'ప్రగతి' సమావేశ కార్యక్రమానికి మోదీ అధ్యక్షత వహించారు. ఎనిమిది మెగా ప్రాజెక్టులు సహా.. ఒక పథకానికి సంబంధించిన ఫిర్యాదు, ఎజెండాలోని 10 అంశాలపై సమీక్షించారు. అభివృద్ధి ప్రాజెక్టుల వేగాన్ని పెంచాల్సిందిగా అధికారులకు సూచించారు.

యుద్ధప్రాతిపదికన..

వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల అమలు ఆలస్యంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల అమలులో అడ్డంకిగా ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనకు(పీఎంజీఎస్​వై) సంబంధించిన ఫిర్యాదులపై ప్రధాని సమీక్ష చేపట్టారు. ఈ పథకం కింద నిర్మిస్తున్న రహదారుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ రాష్ట్రాల్లో..

బంగాల్, అసోం, తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, సిక్కిం, ఉత్తర్​ప్రదేశ్, మిజోరం, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి.

మంత్రిత్వ శాఖల పరిధిలో..

వీటిలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి మూడు, రైల్వే ప్రాజెక్టులు రెండు, విద్యుత్, పెట్రోలియం, సహజవాయువు, హోం మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కో ప్రాజెక్టు ఉన్నాయి.

ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్​(సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌) నిర్మూలన కార్యక్రమంపై మోదీ ప్రత్యేకంగా సమీక్షించారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఇదీ చదవండి:వ్యాపారం ప్రభుత్వ విధి కాదు: మోదీ

Last Updated : Feb 24, 2021, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details