కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఎక్కడా కనిపించట్లేదని దుయ్యబట్టారు. ఈ కష్టకాలంలో పరోపకారం చేస్తున్న ప్రతి ఒక్కరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
"కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కాక ప్రజల పక్షాన నిలవడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. పరోపకారం చేస్తున్న వందలాది మంది కథలు ప్రతిరోజు వింటున్నాము. భారత్ అంటే ఏంటో వారు ప్రపంచానికి తెలుపుతున్నారు."