తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దుష్ప్రచారంతో రాజకీయ అస్థిరతకు కుట్ర!' - భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

సాగు చట్టాలు, సీఏఏ, కార్మిక చట్టాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయ అస్థిరత సృష్టించేందుకే ఇలా చేస్తున్నారని భాజపా 41వ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగంలో ఆరోపించారు.

BJP
శ్యామ్​ప్రసాద్​ ముఖర్జీ

By

Published : Apr 6, 2021, 11:16 AM IST

Updated : Apr 6, 2021, 12:24 PM IST

దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించాలన్న దురాలోచనతో కొందరు తమ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. నిజానిజాలేంటో ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచెప్పాలని భాజపా కార్యకర్తలకు సూచించారు.

భాజపా 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి వర్చువల్​గా ప్రసంగించారు మోదీ. సాగు చట్టాలు, సీఏఏ, కార్మిక చట్టాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. "భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చుతుందని కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వెనుక రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. లేనిపోని అనుమానాలు, భయాలు సృష్టించి దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించాలన్నదే వారి ఉద్దేశం" అని అన్నారు.

"భాజపాను ఎన్నికల్లో గెలిచే యంత్రంగా కొందరు అభివర్ణించడం దురదృష్టకరం. భారత దేశ ప్రజాస్వామ్యం సాధించిన పరిపక్వతను అర్థం చేసుకోలేని వారే అలా అంటారు" అని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:'న్యాయంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేది అప్పుడే'

Last Updated : Apr 6, 2021, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details