గుజరాత్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గాంధీనగర్లో పునరుద్ధరించిన రైల్వే స్టేషన్లో ఫైవ్ స్టార్ హోటల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పట్టణాభివృద్ధిలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని మోదీ స్పష్టం చేశారు.
" దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఎంతో కీలకం. అందుకు ఆధునీకరించిన గాంధీనగర్ రైల్వేస్టేషన్ ఓ ఉదాహరణ. ఆధునిక సాంకేతికత వినియోగానికి ఇది నిదర్శనం. అన్ని రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన వివిధ దశల్లో ఉంది. దేశంలోని ప్రతి ప్రాంతానికి రైల్వే సేవలు చేరటం ద్వారా ఆత్మనిర్భరత వృద్ధి చెందుతుంది. రైల్వేలో భద్రత, వేగం, పరిశుభ్రత, సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రైళ్లు ప్రయాణిస్తాయి."
-- ప్రధాని నరేంద్ర మోదీ