తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాలపై ఈ-బుక్​లెట్​లు చదవాలని మోదీ విజ్ఞప్తి - వ్యవసాయ చట్టాల ఈ-బుక్లెట్​ షేర్​ చేసిన మోదీ

వ్యవసాయ చట్టాల గురించి వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'ఈ-బుక్​లెట్​'లను అందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆంగ్లం, హిందీ భాషల్లో బుక్​లెట్లు విడుదలయ్యాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

PM Modi urges people to read e-booklet highlighting how agro-reforms help farmers
'వ్యవసాయ చట్టాలపై స్పష్టత ఇచ్చే ఈ-బుక్లెట్లు చదవండి'

By

Published : Dec 19, 2020, 12:39 PM IST

వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన 'ఈ బుక్​లెట్​' ​లను చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ సాగు చట్టాల ప్రయోజనాలు, వీటి ద్వారా లబ్ధి పొందిన రైతుల విజయగాథలను పేర్కొంటూ కేంద్రం ఈ-బుక్​లెట్లు విడుదల చేసింది. ఆంగ్లం, హిందీ భాషల్లో ఇవి లభ్యమవుతాయని.. అందరూ వీటిని చదివి షేర్​ చేయాలని మోదీ ట్వీట్​ చేశారు.

"ఇటీవలే అమలు చేసిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో అనే దానిపై ఈ-బుక్​లెట్​లలో పూర్తి వివరణ ఉంది. నమో యాప్​లోనూ మీరు వీటిని చూడవచ్చు. అవి చదివి అందరికీ షేర్​ చేయండి".

- నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు మూడు వారాలుగా దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం, రైతు సంఘాలు పలుమార్లు చర్చలు జరిపినా ఈ విషయంపై స్పష్టత రాలేదు.

ఇదీ చదవండి:సిక్కుగురు తేజ్​ బహదూర్​కు ప్రధాని నివాళి

ABOUT THE AUTHOR

...view details