స్వీడన్ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్గా సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
మోదీతో సమావేశం కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నట్లు స్వీడన్ ప్రధాని ట్వీట్ చేశారు. కరోనాపై పోరులో పరస్పర సహకారం, మహమ్మారి అంతం తర్వాత సుస్థిర, సమానత్వ సమాజం వంటి అంశాలపై మోదీతో మాట్లాడతానని చెప్పారు.