తెలంగాణ

telangana

జిల్లా అధికారులతో ఈ నెల 20న మోదీ భేటీ

By

Published : May 13, 2021, 9:16 AM IST

కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లాస్థాయి అధికారులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 20న జరిగే సమావేశంలో మోదీ మాట్లాడతారని పీఎంఓ తెలిపింది.

pmo
జిల్లా అధికారులతో ప్రధాని మోదీ భేటీ

కరోనా కట్టడిలో భాగంగా.. దేశంలోని జిల్లాస్థాయి అధికారులతో ఈ నెల 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంకానున్నారు. వర్చువల్​గా జరిగే ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది.

కరోనాపై పోరులో భాగంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధాని. ఇటీవలే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యారు. అనంతరం విడివిడగా వారికి ఫోన్లు చేసి పరిస్థితులను తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:ఆర్థిక రికవరీకి సవాళ్లు- ప్యాకేజీనే పరిష్కారం!

ABOUT THE AUTHOR

...view details