తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​, అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని! - Modi to address rallies in Bengal

బంగాల్, అసోం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదిక ప్రధాని తెలిపారు.

PM Modi to address rallies in Bengal, Assam
బంగాల్​, అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని!

By

Published : Mar 18, 2021, 5:01 AM IST

బంగాల్​, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక తెలిపారు. బంగాల్​ ప్రజలకు మంచి పాలన అందించడమే భాజపా ఎజెండా అని పేర్కొన్నారు. మరోవైపు అసోం గురించి మాట్లాడిన మోదీ.. గత ఐదేళ్లలో పలు రంగాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.

"మార్చి 18న బంగాల్​లోని సోదరి సోదరీమణులను కలుసుకునే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. నేను పురులియాలో ఓ ర్యాలీలో పాల్గొంటాను. బంగాల్​ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడమే భాజపా ప్రధాన ఉద్దేశం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

"అసోంలోనూ గురువారం పర్యటిస్తాను. కరీమ్​గంజ్​లో నిర్వహించనున్న ర్యాలీలో ఆ రాష్ట్ర ప్రజలను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. గత ఐదేళ్లుగా అసోం వివిధ రంగాలలో సానుకూల మార్పులను వచ్చాయి. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎన్​డీఏను ప్రజలు ఆశీర్వదించాలి" అని మరో ట్వీట్​ చేశారు ప్రధాని.

ఇదీ చూడండి:టీఎంసీ మేనిఫెస్టో: ఏడాదిలో 5లక్షల ఉద్యోగాలు

ABOUT THE AUTHOR

...view details