ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేడు(ఆదివారం) భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం కానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన నిర్వహిస్తోన్న ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
దిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుందని భాజపా ప్రకటించింది. ప్రధాని మోదీ సమావేశాన్ని ప్రారంభించి.. పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపింది.
ఈ సందర్భంగా సమావేశంపై కీలక విషయాలు వెల్లడించారు ఝార్ఖండ్ భాజపా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ దీపక్ ప్రకాశ్.