తెలంగాణ

telangana

World Lion Day: 'గత కొన్నేళ్లలో సింహాల సంఖ్య పెరిగింది'

By

Published : Aug 10, 2021, 9:54 AM IST

భారత్​లో సింహాల సంఖ్య క్రమంగా పెరిగిందన్నారు ప్రధాని మోదీ. వరల్డ్​ లయన్​ డే సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

PM, Modi
మోదీ, ప్రధాని

భారత్​లో గత కొన్నేళ్లలో సింహాల సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ధైర్యానికి సింహం నిదర్శనం అని, ఆసియా సింహాలకు నిలయంగా ఉన్నందున భారత్​ గర్విస్తోందని మోదీ ట్వీట్ చేశారు.

ప్రపంచ సింహాల దినోత్సవం

"ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా.. వాటి సంరక్షణ కోసం పాటుపడేవారందరికీ నా అభినందనలు. గత కొన్నేళ్లలో భారత్​లో సింహాల సంఖ్య క్రమంగా పెరిగింది."

--నరేంద్ర మోదీ, ప్రధాని.

గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిర్​ సింహాల కోసం రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు మోదీ. అంతర్జాతయంగా, స్థానికంగా సింహాల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలున్నాయని తెలిపారు.

వరల్డ్ లయన్ డే
భారత్​లో పెరిగిన సింహాల సంఖ్య

ఇదీ చదవండి:సముద్రాల భద్రతకు మోదీ 'పంచ సూత్రాలు'

ABOUT THE AUTHOR

...view details