తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోర్ట్​ బ్లెయిర్​లో జెండా ఆవిష్కరించిన ప్రధాని - పోర్ట్​బ్లెయిర్​లో మొదటి సారి జెండా ఆవిష్కరించిన బోస్

జాతీయ జెండా మొదటిసారి ఎగిరి నేటికి 75 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా పోర్ట్​ బ్లెయిర్​లో జెండా ఆవిష్కరణ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... సుభాష్​ చంద్రబోస్​ను స్మరించుకున్నారు. దేశానికి నేతాజీ చేసిన సేవలను గుర్తుచేశారు.

75th anniversary of tricolour hoisting at Port Bl
పోర్ట్​ బ్లెయిర్​లో జెండా ఆవిష్కరించిన ప్రధాని

By

Published : Dec 30, 2020, 7:02 PM IST

పోర్ట్​బ్లెయిర్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. సుభాష్​ చంద్రబోస్​ను స్మరించుకున్నారు. నేతాజీ త్రివర్ణ పతాకం మొదటిసారి ఆవిష్కరించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని పర్యటించినట్లు మోదీ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

నేతాజీని విగ్రహం వద్ద మోదీ

"1943 డిసెంబర్​ 30... దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ రోజు పోర్ట్ బ్లెయిర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. మొదటి సారి జాతీయ పతాకం ఎగిరి నేటికి 75 సంవత్సరాలు అయింది. నేడు పోర్ట్​ బ్లెయిర్​లో జెండా ఆవిష్కరించడం ఆనందంగా ఉంది".

-నరేంద్ర మోదీ, ప్రధాని.

నేతాజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. ఆజాద్​ హింద్​ ఫౌజ్​ స్థాపనలో నేతాజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

జెండా ఆవిష్కరించిన మోదీ
పోర్ట్​ బ్లెయిర్​లో ప్రధాని మోదీ

ఇదీ చదవండి:'ధర్మెగౌడ ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ'

ABOUT THE AUTHOR

...view details