తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2022, 11:50 AM IST

ETV Bharat / bharat

'పండగల సామగ్రి లోకల్ మార్కెట్​లోనే కొంటే వారికి ప్రోత్సాహం'

PM Modi mann ki baat: 86వ 'మన్​కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశంలో రానున్న పండగలకు సామాగ్రిని లోకల్​ మార్కెట్​లో కొనుగోలు చేసి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. 2014 తర్వాత.. భారత్​ నుంచి విదేశాలకు స్మగ్లింగ్​ గురైన 200కు పైగా విగ్రహాలను తెప్పించామని మోదీ తెలిపారు.

PM Modi mann ki baat
ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi mann ki baat: దేశంలో రానున్న పండగలకు సామాగ్రిని స్థానిక మార్కెట్​లోనే కొనుగోలు చేయమని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. 'వోకల్​ ఫర్ లోకల్​' కార్యక్రమంలో భాగంగా.. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ఈ మేరకు 86వ 'మన్​కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కరోనా వేళ శివరాత్రి, హోళీ పండగలను జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.

దేశంలోని అనేక విగ్రహాలు స్మగ్లింగ్​కు గురయ్యాయని, వాటిని ఇతర దేశాల్లో విక్రయించారని ప్రధాని మోదీ తెలిపారు. 2013 వరకు కేవలం తస్కరించిన 13 విగ్రహాలు మాత్రమే భారత్​కు తీసుకు వచ్చారని అన్నారు. 2014 తర్వాత.. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల నుంచి 200కు పైగా విగ్రహాలను తెప్పించామని ప్రధాని మోదీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details