తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గత ప్రభుత్వాల తప్పులను సరిచేస్తున్నాం: మోదీ - ప్రధాని మోదీ

గత ప్రభుత్వాల తప్పులను తాము సరిచేస్తున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. పోరాట యోధులకు గతంలో తగిన గౌరవాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో ప్రముఖ పోరాట యోధుడు సుహేల్​ దేవ్​ విగ్రహ ప్రతిష్ఠకు శంకుస్థాపన చేసిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi lays the foundation stone of Maharaja Suheldev Memorial and development work of Chittaura Lake in UP
సుహేల్​దేవ్​ విగ్రహ ప్రతిష్టకు మోదీ శంకుస్థాపన

By

Published : Feb 16, 2021, 1:54 PM IST

పోరాట యోధులను గౌరవించే విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వీరులకు ఇంతకాలం గౌరవం దక్కకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.

ప్రముఖ పోరాట యోధుడు సుహేల్​ దేవ్​ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహ ప్రతిష్ఠకు శంకుస్థాపన చేశారు మోదీ. ఉత్తర్​ప్రదేశ్​లోని బహ్రైచ్​లో జరిగిన ఈ కార్యక్రమానికి వర్చువల్​గా హాజరయ్యారు. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​, సర్దార్​ వల్లభ్ భాయ్​ పటేల్​, బీఆర్​ అంబేడ్కర్​ వంటి నేతలకు తగిన గౌరవం ఇవ్వలేదని గత ప్రభుత్వాలపై మండిపడ్డారు.

"పోరాట యోధులకు గత ప్రభుత్వాలు తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వలేదు. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. ఆ తప్పులను మా ప్రభుత్వం సరిచేస్తోంది."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

రాజ్​భర్​ సంఘంలో ప్రముఖుడు రాజా సుహేల్​దేవ్​. 1033లో చిత్తోరా సరస్సు తీరం వద్ద.. తమపైకి దండయాత్రకు వచ్చిన ఘాజీ సయ్యద్​ సలార్​ మసూద్​పై యుద్ధం చేసి గెలిచారు.

అభివృద్ధి పనులు...

శ్రావస్తి, చిత్తోరా సరస్సు సుందరీకరణకు సంబంధించిన పనులకు పచ్చజెండా ఊపారు మోదీ. దీనితో పాటు బహ్రైచ్​లో సుహేల్​దేవ్​ పేరుతో వైద్య కళాశాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ హాజరయ్యారు.

ఇదీ చూడండి:-మరో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్న మోదీ!

ABOUT THE AUTHOR

...view details