తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిగ్గజ చమురు సంస్థల సీఈఓలతో మోదీ కీలక భేటీ - gas companies modi meeting

దిగ్గజ చమురు సంస్థల సీఈఓలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news)భేటీ అయ్యారు. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి (Modi meeting today) రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. (Modi meeting with CEO)

MODI MEETING
దిగ్గజ చమురు సంస్థల సీఈఓలతో మోదీ భేటీ

By

Published : Oct 20, 2021, 7:02 PM IST

ప్రపంచంలోని దిగ్గజ ఆయిల్ కంపెనీల సీఈఓలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi meeting today) సమావేశమయ్యారు. అతిపెద్ద చమరుు సంస్థ అయిన సౌదీ ఆరామ్​కో, రష్యాకు చెందిన రోస్​నెఫ్ట్ సహా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు (Modi meeting with CEO) జరిపారు. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, భారత్​లోని హైడ్రోకార్బన్ రంగంలో ఉత్పత్తి, ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. (Modi news)

ఆయిల్ కంపెనీల సీఈఓలతో మోదీ
.

ఈ సమావేశానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, రోస్​నెఫ్ట్ ఛైర్మన్ డాక్టర్ ఐగోర్ సెచిన్, సౌదీ ఆరామ్​కో అధ్యక్షుడు ఆమిన్ నాసర్, భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ హాజరయ్యారు. పెట్రోల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ భేటీకి(PM Modi news) ప్రాధాన్యం సంతరించుకుంది.

వర్చువల్ సమావేశంలో నిర్మలా సీతారామన్

సెరా వీక్ కాన్ఫరెన్స్​లో (Ceraweek global energy) భాగంగా ప్రపంచంలో చమురును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు దిల్లీలో సమావేశమవుతున్నాయి(Ceraweek Conference). ఆయా దేశాల ఇంధన శాఖ మంత్రులు, చమురు సంస్థల ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. భారత్ తరఫున పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ సమావేశానికి హాజరవుతారు. అక్టోబర్ 20-22 మధ్య ఈ సమావేశాలు జరుగుతాయి.

ఇదీ చదవండి:పెట్రోల్ ధరలు తగ్గేలా అంతర్జాతీయంగా మోదీ ప్రయత్నాలు!

ABOUT THE AUTHOR

...view details