తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉక్రెయిన్​ పరిణామాలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం

Ukraine crisis: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న క్రమంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశంలోని పరిస్థితులు, భారతీయుల తరలింపుపై చర్చించినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Feb 27, 2022, 10:42 PM IST

PM Modi
మోదీ ఉన్నతస్థాయి సమావేశం

Ukraine crisis: ఉక్రెయిన్​ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ దేశంలో తాజా పరిస్థితులు, భారతీయుల తరలింపు ప్రక్రియ తదితర అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జైశంకర్, విదేశాంగ శాఖ సెక్రెటరీ హర్షవర్ధన్​ ష్రింగ్లా​ సహా ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. దిల్లీ చేరుకున్న వెంటనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో ఉక్రెయిన్​లో పెద్ద సంఖ్యలో భారతీయులు ముఖ్యంగా విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇప్పటికే వారిని తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 900కుపైగా భారత పౌరులను స్వదేశానికి చేర్చారు. మరోవైపు.. రష్యా, ఉక్రెయిన్​ అధ్యక్షులతో మాట్లాడిన మోదీ.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతి కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details