తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోదీ - మాఘ్‌ బిహు

ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు మకర సంక్రాంతి, మాఘ్​​బిహు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దక్షణాయణం నుంచి ఉత్తరాయణంకు సూర్యుడు మారుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో కొత్త ఉత్సాహం,శక్తిని నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

PM Modi greets citizens on Makar Sankranti, Pongal, Magh Bihu
మకరసంక్రాంతి,మాఘ్​బిహు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

By

Published : Jan 14, 2021, 11:45 AM IST

Updated : Jan 14, 2021, 12:24 PM IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గురువారం పండుగల సందడి నెలకొనడంతో ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తమిళ ప్రజలకు పొంగల్‌, అసోం ప్రజలకు మాఘ్‌ బిహు, గుజరాతీలకు ఉత్తరాయన్‌, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు.

'భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం భారతదేశం వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. మన సంప్రదాయాలు ఏర్పాటు చేసిన చైతన్యాన్ని గుర్తుకుతెస్తాయి. తల్లి లాంటి ప్రకృతిని గౌరవించడాన్ని ఈ పండుగ ప్రోత్సహిస్తుంది' అని ప్రధాని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంత వైభవంగా జరుపుకుంటారో అలాగే అసోంలో మాఘ్ ‌బిహుకు అంతటి ప్రాముఖ్యం ఉంది.

ఇదీ చూడండి: తమిళనాట జల్లికట్టు జోరు- బసవన్నల హోరు

Last Updated : Jan 14, 2021, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details