తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 10:07 PM IST

ETV Bharat / bharat

ఆక్సిజన్, ఔషధాల లభ్యతపై మోదీ సమీక్ష

కరోనా మొదటి దశతో పోల్చితే.. దేశంలో ఆక్సిజన్ సరఫరా మూడింతలు పెరిగినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. దేశంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా ఇతర ఔషధాల లభ్యతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత, సరఫరా ఇతర ఔషధాల లభ్యతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా మొదటి దశతో పోల్చితే.. ఆక్సిజన్ సరఫరా మూడింతలు పెరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

గత కొన్ని వారాలుగా దేశంలో రెమ్​డెసివిర్​తో పాటు ఇతర ఔషధాల ఉత్పత్తి పెరిగిందని ప్రధాని కార్యాలయం తెలిపింది. వెంటిలేటర్ల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించినట్లు పేర్కొంది. రాష్ట్రాలకు సరిపడా మందులు సరఫరా చేస్తున్నామని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details